పోలీసులను చూసి మద్యం వదిలేశారు..

by Disha Web Desk 20 |
పోలీసులను చూసి మద్యం వదిలేశారు..
X

దిశ, ఊట్కూర్ : పోలీసులను చూసి మద్యం సీసాలనూ అక్కడే వదిలిపెట్టిన సంఘటన మండల చెక్ పోస్ట్ దగ్గర చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి వరి ధాన్యం తెలంగాణలోకి ప్రవేశించకుండా మండల సరిహద్దులో ఏర్పాటుచేసిన సమిస్తాపూర్ చెక్ పోస్ట్ దగ్గర ఉన్న పోలీసులను చూసి మద్యం సీసాలను అక్కడే పడవేసి ఓ వ్యక్తి పరారైనట్లు తెలిపారు.

పరారయిన వ్యక్తిని గమనించిన పోలీసులు అక్కడికి వెళ్లి చూడగా మద్యం సీసాలు లభించాయని పేర్కొన్నారు. 16 ఓసీ 90, 5 ఓసీ క్వార్టర్లు, 2 ఎంసీ డేట్, 6 బీర్లు లభించినట్లు తెలిపారు. ఎవరైనా అక్రమ మద్యం రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై రమేష్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్సై రమేష్, ఎక్సైజ్ కానిస్టేబుల్ హర్షవర్ధన్ గౌడ్, రాజ్ నరసయ్య గౌడ్, రాజశేఖర్, బాలయ్య, ఉన్నారు.

Next Story