- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Home > జిల్లా వార్తలు > మహబూబ్ నగర్ > నిజాయితీకి నిదర్శనం ఈ మహిళలు.. దొరికిన డబ్బులు పోలీసులకు అప్పగింత..!
నిజాయితీకి నిదర్శనం ఈ మహిళలు.. దొరికిన డబ్బులు పోలీసులకు అప్పగింత..!
దిశ, గద్వాల క్రైం : గద్వాల పట్టణంలోని బాలికల పాఠశాల ముందు ఒక అపూర్వ సంఘటన చోటుచేసుకుంది. రోడ్డుపై ఎవరివో గుర్తు తెలియని వ్యక్తులకు చెందిన ₹5,000 నగదు పడిపోయింది.

X
దిశ, గద్వాల క్రైం : గద్వాల పట్టణంలోని బాలికల పాఠశాల ముందు ఒక అపూర్వ సంఘటన చోటుచేసుకుంది. రోడ్డుపై ఎవరివో గుర్తు తెలియని వ్యక్తులకు చెందిన ₹5,000 నగదు పడిపోయింది. అదే సమయంలో ఆ దారిలో వెళ్తున్న దౌదర్ పల్లిలో నివాసం ఉంటున్న కంట్లో నలుసు తీసే ముగ్గురు మహిళలకు ఆ డబ్బులు కనిపించాయి. వారు ఆ నగదును తమ వద్ద ఉంచుకోకుండా, నిజాయితీకి నిదర్శనంగా గద్వాల ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో ఉన్న ట్రాఫిక్ ఎస్ఐ బాలచంద్రుడుకు అప్పగించారు. ఈ సందర్భంలో ఎస్ఐ బాలచంద్రుడు మాట్లాడుతూ ఇలాంటి నిజాయితీ గల మహిళలు సమాజానికి ఆదర్శం. ఇలాంటి మనుషుల వల్లే నమ్మకం నిలుస్తుంది” అని పేర్కొన్నారు. నగదు కోల్పోయిన వారు గద్వాల ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ను సంప్రదించి తమ వివరాలు ఇచ్చుకోవచ్చని తెలిపారు. ఈ ఘటన గద్వాల పట్టణంలో చర్చనీయాంశంగా మారింది. ఆ మహిళల నిజాయితీని పలువురు ప్రశంసిస్తున్నారు.
Next Story






