అన్న మృతి చెందాడని మనస్థాపానికి గురై తమ్ముడు ఆత్మహత్య..

by Disha Web Desk 11 |
అన్న మృతి చెందాడని మనస్థాపానికి గురై తమ్ముడు ఆత్మహత్య..
X

దిశ, కల్వకుర్తి: అన్న మృతి చెందడంతో మనస్థాపానికి గురై తమ్ముడు ఆత్మహత్య కు పాల్పడిన సంఘటన నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండల పరిధి జిల్లెల్ల గ్రామంలో జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. జిల్లెల్ల గ్రామానికి చెందిన నాప శ్రీశైలంకి ఇద్దరు కుమారులు, ఒక కూతురు సంతానం. ఈ నెల 19వ తేదీన ఇంటి వద్ద అన్నదమ్ముల గొడవలతో పెద్ద కుమారుడు నాప మహేష్ (22) ఇంట్లో ప్యాన్ కు ఉరేసుకొని మృతి చెందాడు. అన్న మృతి చెందడంతో తమ్ముడైన శివ (19) తీవ్ర మనస్థాపానికి గురైనాడు.

కాగా మృతుడు మహేష్ మూడు రోజుల కార్యక్రమంలో భాగంగా పొలానికి చేరుకున్న శివ ఎవరూ లేని నిర్మానుష్య ప్రదేశంలో పురుగుల మందు తాగాడు. ఈ విషయాన్నీ గమనించిన కుటుంబీకులు హుటాహుటిన వెల్డండలోని ఓ హాస్పిటల్ కు తరలించారు. రెండు రోజుల చికిత్స అనంతరం మంగళవారం మృతి చెందాడు. కుటుంబంలో ఇద్దరు మృతి చెందడంతో విషాదం నెలకొంది. గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి.



Next Story

Most Viewed