షాపింగ్ కి వెళ్లిన పెళ్లి బృందం.. దుకాణంలో రూ. లక్ష మాయం..!

by Disha Web Desk 11 |
షాపింగ్ కి వెళ్లిన పెళ్లి బృందం.. దుకాణంలో రూ. లక్ష మాయం..!
X

దిశ, ప్రతినిధి నాగర్ కర్నూల్: నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని సంత బజారులోని ఓ దుస్తుల దుకాణంలోకి షాపింగ్ కి వెళ్లిన పెళ్లి బృందానికి షాక్ తగిలింది. పెళ్లి దుస్తులు కొనుగోలు నిమిత్తం తీసుకొచ్చిన నగదు దుకాణంలో మాయమైంది. ఈ ఘటన ఈ నెల 22వ తేదీన జరుగగా సోమవారం ఆలస్యంగా వెలుగు చూసింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నాగర్ కర్నూల్ పట్టణం సంత బజారులోని శ్రీలత క్లాత్ మర్చంట్ దుకాణానికి కొల్లాపూర్ మండలం మొలచింతలపల్లి గ్రామానికి చెందిన వరుడి బంధువులు, తెలకపల్లి మండలం గట్టు రాయిపాకుల గ్రామానికి చెందిన వధువు బంధువులు కలిసి పెళ్లి దుస్తులు తీసుకునేందుకు వచ్చారు.

బంధువులంతా పెళ్లి దుస్తులపై దృష్టి పెడితే వీరి పక్కనే ఓ గుర్తు తెలియని 15 ఏళ్ల బాలుడు వారు తీసుకొచ్చిన నగదు మీద దృష్టి పెట్టాడు. సుమారు అరగంట పాటు నగదు ఉన్న వ్యక్తి దగ్గర రెక్కీ నిర్వహించి చాకచక్యంగా లక్ష రూపాయలను కొల్లగొట్టాడు. తీరా దుస్తులు తీసుకున్న తర్వాత డబ్బుల కోసం వెతకగా మాయమైనట్లు గుర్తించారు. వెంటనే సీసీ టీవీ పుటేజీ పరిశీలించగా విషయం బయటపడింది. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రెండు రోజులుగా బాలుడి ఆచూకీ కోసం గాలిస్తున్నారు.

Next Story