ప్రభుత్వ ఆస్పత్రుల్లో మారని పరిస్థితి.. కాన్పు కోసం వచ్చిన మహిళను చేర్పించుకోని సిబ్బంది

by Web Desk |
ప్రభుత్వ ఆస్పత్రుల్లో మారని పరిస్థితి.. కాన్పు కోసం వచ్చిన మహిళను చేర్పించుకోని సిబ్బంది
X

దిశ, నాగర్‌కర్నూల్: జిల్లాలో ధారుణం చోటు చేసుకుంది. పురిటి నొప్పులతో వచ్చిన మహిళను ఏవేవో కారణాలు చెప్పి ఆస్పత్రిలో చేర్చుకోకుండా పాలమూరు పొమ్మన్నారు. అచ్చంపేట ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో తల్లడిల్లుతూ ఆడ బిడ్డకు జన్మనిచ్చిన హృదయ విదారక ఘటన మరువక ముందే మరో మారు అలాంటి ఘటనే చోటుచేసుకోవడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గురువారం ఉదయం తాడూరు మండలం బాలన్ పల్లికి చెందిన గర్భిణీ జిల్లా ఆసుపత్రికి రాగ మొదట కాన్పు చేస్తామని చెప్పిన వైద్యులు కోవిడ్ రిపోర్టులు వచ్చే సరికి ఏదేదో కారణాలు చెబుతూ పాలమూరు పోవాలని హెచ్చరించినట్లు తెలిపారు.

దీనిపై సూపరింటెండెంట్ శివరాంని వివరణ కోరేందుకు ప్రయత్నించగా అందుబాటులోకి రాకపోవడం విశేషం. ఈ ఘటన సమయంలో మంత్రి ఇదే జిల్లా పర్యటనలో ఉన్నారు. అంతా బాగానే ఉందని గొప్పలు చెప్పుకున్న వైద్యారోగ్యశాఖ పనితీరు ఈ రెండు సంఘటనలు నిదర్శనం.అయితే విషయం తెలుసుకున్న మంత్రి ఘటనకు కారకులైన వారిపై సస్పెన్షన్ వేటు వేయాలని ఆదేశించినట్లు సమాచారం.


Next Story

Most Viewed