మున్సిపాలిటీ పట్టణ ప్రగతి దినోత్సవానికి ప్రతిపక్ష కౌన్సిలర్ల డుమ్మా..

by Disha Web Desk 20 |
మున్సిపాలిటీ పట్టణ ప్రగతి దినోత్సవానికి ప్రతిపక్ష కౌన్సిలర్ల డుమ్మా..
X

దిశ, నారాయణపేట ప్రతినిధి : జిల్లా కేంద్రంలోని జీపీ శెట్టి ఫంక్షన్ హాల్లో శుక్రవారం తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల ప్రత్యేక కార్యక్రమంలో నారాయణపేట మున్సిపాలిటీ పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ చైర్ పర్సన్ అనసూయ, ఎమ్మెల్యే సతీమణి స్వాతిరెడ్డి, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ మోసటి జ్యోతి, కమిషనర్ సునీత ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు.

వీరితోపాటు బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు శిరీష, రాజేశ్వరి, మేఘ, జొన్నల అనిత, నారాయణమ్మ, వరలక్ష్మి, అమీరుద్దీన్, గురు లింగంలు మాత్రమే హాజరు కాగా బీజేపీ, కాంగ్రెస్, ఎంఐఎం, పార్టీ నుంచి కౌన్సిలర్లుగా గెలుపొందిన వారు ఎవరు కూడా మున్సిపాలిటీ పట్టణ ప్రగతి దినోత్సవానికి హాజరు కాలేదు. ఇదిలా ఉండగా నారాయణపేట మున్సిపాలిటీ పరిధిలో ఆశించిన మేర పట్టణ ప్రగతి పనులు జరగలేదని అందుకే తాము ఈ కార్యక్రమానికి హాజరు కాలేదని పలువురు దిశకు తెలిపారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed