బీజెపీ నుండి దేశాన్ని విముక్తి చేయాలి

by Disha Web Desk 22 |
బీజెపీ నుండి దేశాన్ని విముక్తి చేయాలి
X

దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్: బీజెపీ నుండి దేశాన్ని విముక్తి చేయడానికి ప్రతి ఒక్కరూ కలిసిరావాలని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని సాయి కృష్ణ ఫంక్షన్ హాల్లో జరిగిన సీపీఐ పార్లమెంట్ మండల కార్యదర్శుల ముఖ్య సమావేశంలో ఆయన కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి చల్లా వంశీచంద్ రెడ్డితో కలిసి పాల్గొని ప్రసంగించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజల సహకారంతో కనిపించే శత్రువుతో పోరాడి ఘనమైన విజయాన్ని సొంతం చేసుకున్నామని, ఈ పార్లమెంటు ఎన్నికల్లో కనిపించని శత్రువుతో యుద్ధం చేయబోతున్నామని ఆయన అన్నారు. మహబూబ్ నగర్ ఎంపీ సీటును మనం గెలవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని, ఈ గెలుపుతోనే మన మహబూబ్ నగర్ అభివృద్ధి ముడిపడి ఉందని, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాధ్యుడుగా వ్యవహరిస్తున్న ఈ నియోజకవర్గం రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా అత్యంత కీలకమైనదిగా ఆయన అభిప్రాయపడ్డారు. గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా సీపీఐ కాంగ్రెస్ పార్టీ కలయికతో తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టినామని, అలాగే ‌మళ్లీ ఇప్పుడు దేశంలో సైతం బిజేపి ని ఓడించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన పేర్కొన్నారు.

అంతకుముందు ఎంపీ అభ్యర్థి చల్లా వంశీచంద్ రెడ్డి మాట్లాడుతూ… మీ ద్వారా ఏ సమస్య మా దృష్టికి వచ్చినా ఆ సమస్య పరిష్కారానికి సత్వరమే కృషి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి బాల్ నర్సింహా, సిరాజ్ ఖాద్రీ, లక్ష్మణ్ యాదవ్, సుధాకర్ రెడ్డి, రాఘవేందర్, కొండన్న, విజయ రాములు, బాలకిషన్, పర్వతాలు, నర్సింహులు తదితరులు పాల్గొన్నారు


Next Story

Most Viewed