ఆంధ్రప్రదేశ్‌లో తీవ్ర విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య

by Disha Web Desk 19 |
ఆంధ్రప్రదేశ్‌లో తీవ్ర విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూల్ జిల్లా వల్లూరులో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. తల్లి, కొడుకు, కూతురు చెట్టుకు ఉరి వేసుకుని సూసైడ్ చేసుకున్నారు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వం ఆసుపత్రికి తరలించారు. మృతుల కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. తల్లి, కొడుకు, కూతురు మృతికి కుటుంబ కలహాలే కారణమని స్థానికులు పోలీసులకు వివరించారు. ఆత్మహత్యలకు కుటుంబ కలహాలేనా మరేదైనా కారణం ఉందా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఒకేసారి ఆత్మహత్యకు పాల్పడటంతో వల్లూర్ గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి..

Next Story

Most Viewed