కంటి వెలుగు కేంద్రాన్ని ప్రారంభించిన కలెక్టర్..

by Disha Web Desk 11 |
కంటి వెలుగు కేంద్రాన్ని ప్రారంభించిన కలెక్టర్..
X

దిశ, కొత్తకోట: కొత్తకోట మండలం కానయపల్లి గ్రామంలో రెండో విడత కంటి వెలుగు కేంద్రాన్ని మంగళవారం వనపర్తి జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ కంటి పరీక్షలు చేసుకోవాలని అవసరమైన వారికి కంటి ఆపరేషన్లు కూడా ప్రభుత్వమే ఉచితంగా చేస్తుందని కంటి అద్దాలు ప్రజలకు ఉచితంగా ఇస్తుందని ఈ అవకాశాన్ని ప్రజలు వినియోగించుకోవాలని కలెక్టర్ తెలిపారు.

అనంతరం గ్రామంలోని శంకర్ సముద్రం రిజర్వాయర్ లను పరిశీలించి ముంపు గ్రామాల నిర్వాసితులను వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. త్వరలో మీ సమస్యలను ప్రభుత్వం పరిష్కరిస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ వామన్ గౌడ్, సీడీసీ చైర్మన్ చెన్నకేశవరెడ్డి, గ్రామ సర్పంచ్ సుదర్శన్ రెడ్డి, వైస్ ఎంపీపీ వడ్డే శీను, ఎమ్మార్వో బాల్ రెడ్డి, సురేంద్రనాథ్ రెడ్డి, గాడిల ప్రశాంత్, అయ్యన్న తదితరులు పాల్గొన్నారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story