- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నిరసన వ్యక్తం చేసిన ఉపాధ్యాయులు
దిశ, మల్దకల్ : మల్దకల్ మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ఎర్రవల్లి మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గణిత ఉపాధ్యాయులకు మూడు రోజుల పాటు వృత్యంతర

దిశ, మల్దకల్ : మల్దకల్ మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ఎర్రవల్లి మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గణిత ఉపాధ్యాయులకు మూడు రోజుల పాటు వృత్యంతర శిక్షణ కార్యక్రమం ప్రారంభించారు. అయితే ప్రస్తుతం ఎన్నికల డ్యూటీలు, మరోవైపు ఎస్ఏ 1 పరీక్షలు సమీపిస్తున్న నేపథ్యంలో సిలబస్ పూర్తి చేసుకునే బాధ్యత ఉపాధ్యాయులపై ఉంటుంది. ఇలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో శిక్షణ కార్యక్రమం నిర్వహించడం అవసరమా..? అంటూ నిరసన వ్యక్తం చేశారు ఉపాధ్యాయులు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు మాట్లాడుతూ ఇప్పటికే దసరా పండుగ సెలవులు, స్థానిక ఎన్నికల పరిస్థితుల దృష్ట్యా విద్యార్థుల హాజరు శాతం తగ్గిపోయిందని.. ఇప్పుడే పాఠశాలకు విద్యార్థులు మెల్లగా వస్తున్న సమయంలోనే శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు. శిక్షణ కార్యక్రమం విరామ సమయంలో ఉపాధ్యాయులు నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు శ్రీధర్ రెడ్డి, వెంకటేష్, భాస్కర్ గౌడ్, రవీందర్, కృష్ణయ్య, శ్రీనివాసులు, సతీష్చంద్ర, రమణా రెడ్ది, అనిత, రేణుక పాల్గొన్నారు.






