పాఠ్యాంశాల బోధనకు తపస్ కాలమాని కొలమానం : ఎంఈఓ అమీరుద్దిన్

by Ratna Kumari |

తరగతి గదిలో ఉపాధ్యాయులు పాఠ్యాంశాల బోధనకు తపస్ రూపొందించిన కాలమానం ప్రకారం టీచర్లు విద్యార్థులకు పాఠాలను బోధించడానికి దిక్సూచిగా పని చేస్తుందని మండల విద్యాధికారి అమీరుద్దిన్ అన్నారు.

పాఠ్యాంశాల బోధనకు తపస్ కాలమాని కొలమానం :  ఎంఈఓ అమీరుద్దిన్
X

దిశ‌, మ‌క్త‌ల్ : తరగతి గదిలో ఉపాధ్యాయులు పాఠ్యాంశాల బోధనకు తపస్ రూపొందించిన కాలమానం ప్రకారం టీచర్లు విద్యార్థులకు పాఠాలను బోధించడానికి దిక్సూచిగా పని చేస్తుందని మండల విద్యాధికారి అమీరుద్దిన్ అన్నారు. సోమవారం జిల్లా ప్రధాన కార్యదర్శి బి. రవీందర్ ఆద్వర్యంలో ఎంఆర్సీ భవనం ముందు తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం క్యాలెండర్ ఆవిష్కరించారు. రాబోయే ఏడాది ఉపాధ్యాయ లకు శుభప్రదంగా ఉండాలని హక్కుల సాధనలో, విద్యా ప్రమాణాల పెంపులో తపస్ వేస్తున్న అడుగులకు, రాబోయే విజయాలకు ఇది ఒక ప్రణాళికా పత్రమన్నారు. ఈ కార్యక్రమంలో మండలం అధ్యక్షులు నర్సిములు, నర్సిరెడ్డి, ప్రధాన కార్యదర్శి రాకేష్, వెంకట్రాములు తపస్ సంఘం కార్యవర్గ సభ్యులు, ప్రధానోపాధ్యాయులు నాగార్జున, ప్రధానోపాధ్యాయులు నాగేశ్వర్, జాకీర్ హుస్సేన్, వెంకట్ రాములు, గురుపాదయ్య పాల్గొన్నారు.

Next Story