Kalwakurthy : కల్వకుర్తి నియోజకవర్గంలో జోరుగా సాగుతున్న సర్వేలు

by Disha Web Desk 1 |
Kalwakurthy : కల్వకుర్తి నియోజకవర్గంలో జోరుగా సాగుతున్న సర్వేలు
X

దిశ, మహబూబ్‌నగర్ బ్యూరో : అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో పలు సంస్థలు రెండు రోజులుగా సర్వేలు నిర్వహిస్తున్నాయి. ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి, జడ్పీ వైస్ చైర్మన్ బాలాజీ సింగ్ కాంగ్రెస్ పార్టీలో చేరుతారనే ప్రచారం జోరందుకున్న నేపథ్యంలో ఈ సర్వేలు ప్రస్తుతం ప్రాధాన్యతను సంతరించుకుంటున్నాయి. ఎన్నికల్లో పోటీ చేస్తే ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డికి అవకాశాలు ఉంటాయా.. లేదా సిట్టింగ్ ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ కు అవకాశాలు ఉంటాయా.. అని మాత్రమే సర్వేలో పాల్గొంటున్న ప్రతినిధులు వివరాలు సేకరిస్తున్నట్లు సమాచారం. రెండు సంస్థలకు సంబంధించి దాదాపుగా వందమంది బృందాలుగా ఏర్పడి మండలాల వారీగా వివరాలు సేకరిస్తున్నట్లు తెలుస్తోంది. అధికార పార్టీకి సంబంధించి పార్టీ అధిష్టానం ఈ వివరాలు సేకరిస్తుందా.. అన్న విషయంలో గోప్యతను పాటిస్తున్నారు.

Next Story