గోపాలపేట ఎస్ఐకి చార్జ్ మెమో జారీ చేసిన ఎస్పీ..

by Disha Web Desk 11 |
గోపాలపేట ఎస్ఐకి చార్జ్ మెమో జారీ చేసిన ఎస్పీ..
X

దిశ, గోపాలపేట: వనపర్తి జిల్లా గోపాల్ పేట ఎస్ఐ మల్లేష్ కు శుక్రవారం చార్జ్ మెమో జారీ చేసినట్లు వనపర్తి జిల్లా ఎస్పీ రక్షిత మూర్తి తెలిపారు. శుక్రవారం గోపాల్ పేట, రేవల్లి స్థానిక పోలీస్ స్టేషన్లలలో ఎస్పీ రక్షిత మూర్తి ఆకస్మిక తనిఖీ చేశారు. గోపాల్ పేట ఎస్ఐ మల్లేష్ నిర్లక్ష్యంగా ఉంటూ పెండింగ్ లో ఉన్న కేసులను ఎటువంటి విచారణ చేయకుండా 14 రోజులైనా అలాగే ఉంచాడని అన్నారు. అలాగే స్టేషన్ లో ఉన్న రికార్డులు ఏవీ సరిగాలేవని ఈ విషయంపై తనకు చార్జ్ మెమో ఇస్తున్నట్లు ఎస్పీ తెలిపారు.

Next Story

Most Viewed