శ్మ‌శాన స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రిస్తా : స‌ర్పంచ్ ప‌ర‌శురాం యాద‌వ్

by Ratna Kumari |   (  Updated:2026-03-03 15:10:07  IST  )

మండ‌ల కేంద్రంలోని ఏదుల‌లోని ద‌ళితుల స్మ‌శాన వాటిక‌లో నెల‌కొన్న స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రిస్తాన‌ని స‌ర్పంచ్ ప‌ర‌శురాం యాద‌వ్ తెలిపారు.

శ్మ‌శాన స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రిస్తా : స‌ర్పంచ్ ప‌ర‌శురాం యాద‌వ్
X

దిశ‌, రేవ‌ల్లి : మండ‌ల కేంద్రంలోని ఏదులలోని ద‌ళితుల శ్మ‌శాన వాటిక‌ను గ్రామ స‌ర్పంచ్ కాట‌మోని ప‌ర‌శురాం యాద‌వ్ మంగ‌ళ‌వారం ఆ గ్రామ పెద్ద‌ల‌తో క‌లిసి సంద‌ర్శించారు. అక్క‌డ కావాల్సిన మౌళిక వ‌స‌తుల‌ను ప‌రిశీలించారు. అలాగే స‌మీపంలో ప‌ని చేస్తున్న ఉపాధి హామీ ప‌నుల‌ను కూడా ప‌రిశీలించి ఉపాధి కూలీల‌తో మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా స‌ర్పంచ్ మాట్లాడుతూ శ్మ‌శాన వాటిక‌లో ఉన్న స‌మ‌స్య‌ల‌ను ఎమ్మెల్యే మేఘారెడ్డి దృష్టికి తీసుకెళ్తాన‌ని.. ప‌రిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్య‌క్ర‌మంలో ఉప స‌ర్పంచ్ శేషి రెడ్డి, రామకృష్ణ, జానకిరామ్ యాదవ్, రమేష్ యాదవ్, కురుమూర్తి, ఆంజనేయులు, హుస్సేన్, పిల్లెల్ల సాలయ్య పాల్గొన్నారు.

Next Story