మరమ్మతులకు రూ.10 లక్షల మంజూరు

by Disha Web Desk 4 |
మరమ్మతులకు రూ.10 లక్షల మంజూరు
X

దిశ, మక్తల్ : నారాయణ పేట జిల్లా మక్తల్ పట్టణ కేంద్రంలో సీమాక్ ఆసుపత్రిలో భవనం మరమ్మతులకు ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి మంజూరు చేశారు. ఈ మేరకు రూ. 10 లక్షల మంజూరు ప్రోసీడింగ్ కాపీని మక్తల్ ఎమ్మెల్యే శనివారం మధ్యాహ్నం ఆస్పత్రి అధికారులకు అందజేశారు. మక్తల్ ప్రభుత్వ ఆసుపత్రిలో మేటర్నటి భవనం శిథిలావస్థకు చేరి పెచ్చులూడుతూ.. వర్షాలకు కురుస్తుందని, రోగుల వెంబడి వచ్చిన బంధువులకు ఉండేందుకు షెడ్డు అవసరమని ఇటీవల ఆకస్మిక తనిఖీలు వచ్చిన జిల్లా కలెక్టర్ కొయా శ్రీహర్ష ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో ఆసుపత్రికి వచ్చి షెడ్డు నిర్మాణ స్థలాన్ని ఐడెంటిఫై చేసి త్వరగా పనులు ప్రారంభించాలని సంబంధిత ఇంజనీర్ నాగ శివను ఎమ్మెల్యే ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి డాక్టర్లు. పార్టీ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed