మహబూబ్ నగర్ డీఈవోగా రవీందర్...నాగర్ కర్నూల్ డీఈవోకు అదనపు బాధ్యతలు

by Disha Web Desk 11 |
మహబూబ్ నగర్ డీఈవోగా రవీందర్...నాగర్ కర్నూల్ డీఈవోకు అదనపు బాధ్యతలు
X

దిశ బ్యూరో, మహబూబ్ నగర్: మహబూబ్ నగర్ డీఈవోగా రవీందర్ నియామకం అయ్యారు. ఇక్కడ పనిచేస్తున్న యాదయ్య మంచిర్యాల జిల్లా డీఈవోగా బదిలీ కావడంతో.. ఆయన స్థానంలో రవీందర్ నియామకం అయ్యారు. వనపర్తి జిల్లా డీఈవోగా ఉన్న రవీందర్ గతంలో మహబూబ్ నగర్ ఇన్చార్జి డీఈవోగా బాధ్యతలు నిర్వహించారు. కాగా నాగర్ కర్నూల్ డీఈవో గోవిందరాజులు వనపర్తి జిల్లా డీఈవోగా అదనపు బాధ్యతలను అప్పగిస్తూ రాష్ట్ర విద్యాశాఖ అధికారులు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.

Next Story

Most Viewed