- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మొహర్రం వేడుకల్లో ఘర్షణ.. ఏకంగా ఐదురుగికి !
by velandi.Saikiran |
మొహర్రం పండుగ వేడుకల సందర్భంగా మాగనూరు మండలంలోని నేడుగం దొడ్డి గ్రామంలో శుక్రవారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

X
దిశ, మాగనూర్: మొహర్రం పండుగ వేడుకల సందర్భంగా మాగనూరు మండలంలోని నేడుగం దొడ్డి గ్రామంలో శుక్రవారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పీర్ల ఊరేగింపు బయలుదేరిన సమయంలో ఇరు వర్గాల మధ్య తోపులాట చోటు చేసుకుంది. స్థానికుల సమాచారం ప్రకారం పాత కక్షల నేపథ్యంలోనే ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఘర్షణలో ఇరువర్గాలకు చెందిన మొత్తం ఐదుగురు గాయపడగా, వారికి చికిత్స అందిస్తున్నారు.
సమాచారం అందుకున్న పోలీసులు, వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు మాగనూరు ఎస్సై అశోక్ బాబు తెలిపారు. గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.
Next Story






