పేద కుటుంబానికి పుస్తె మెట్టెలు అంద‌జేత

by Ratna Kumari |   (  Updated:2026-05-03 12:38:20  IST  )

సమాజంలో ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు అండగా నిలుస్తూ, పేదింటి ఆడబిడ్డల పెళ్లిళ్ల లో తనవంతు సహకారం అందిస్తూ వస్తున్న కోన రాజశేఖర్ మరోసారి తన సేవా స్ఫూర్తిని చాటుకున్నారు.

పేద కుటుంబానికి పుస్తె మెట్టెలు అంద‌జేత
X

దిశ‌, దేవ‌ర‌క‌ద్ర : సమాజంలో ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు అండగా నిలుస్తూ, పేదింటి ఆడబిడ్డల పెళ్లిళ్ల లో తనవంతు సహకారం అందిస్తూ వస్తున్న కోన రాజశేఖర్ మరోసారి తన సేవా స్ఫూర్తిని చాటుకున్నారు. దేవరకద్ర మండలం అడవి ఆజిలాపూరం గ్రామానికి చెందిన ధనం ఆంజనేయులు అంజిలమ్మ దంపతుల కనిష్ఠ పుత్రిక రాధా వివాహానికి కాంగ్రెస్ నాయకులు కోన రాజశేఖర్ దంపతులు పుస్తే మెట్టెలు అందజేసి తన సేవా భావాన్ని చాటారు. ఎంతో మంది పేద‌ కుటుంబాలకు చేయూతనిస్తున్న కోన రాజశేఖర్ దంపతులను పలువురు అభినందించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ రాజు గౌడ్, చిన్నయ్య, విష్ణు చారి, అల్లి రాజయ్య, గోవు ఆంజనేయులు గ్రామస్తులు పాల్గొన్నారు.

Next Story