8న ప్రధానమంత్రి నేషనల్ అప్రెంటిషిప్ మేళా

by velandi.Saikiran |

గద్వాలలోని అగ్రికల్చర్ మార్కెట్ యార్డ్ లో ఉన్న ప్రభుత్వ ఐటిఐ లో ప్రధాన మంత్రి నేషనల్ అప్ప్రెంటిషిప్ మేళా సెప్టెంబర్ 8వ

8న ప్రధానమంత్రి నేషనల్ అప్రెంటిషిప్ మేళా
X

దిశ, గద్వాల కలెక్టరేట్ : గద్వాలలోని అగ్రికల్చర్ మార్కెట్ యార్డ్ లో ఉన్న ప్రభుత్వ ఐటిఐ లో ప్రధాన మంత్రి నేషనల్ అప్ప్రెంటిషిప్ మేళా సెప్టెంబర్ 8వ తేదీన నిర్వహించడం జరుగుతుందని ప్రభుత్వ ఐటిఐ ప్రిన్సిపల్ సత్యనారాయణ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇట్టి అప్ప్రెంటిషిప్ మేళాకు హైద్రాబాద్ నుండి వివిధ కంపెనీలు పాల్గొనడం జరుగుతుందని తెలిపారు. ఐటిఐ పాసైన అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికెట్స్, ఒక జిరాక్స్ సెట్ తీసుకొని తేదీ సెప్టెంబర్ 8వ తేదీ 2025 నాడు ఉదయం 10గంటలకు గవర్నమెంట్ ఐటిఐ గద్వాలలో హాజరు కాగలరని ప్రిన్సిపల్ ఎస్ వి వి సత్యనారాయణ ఒక ప్రకటనలో తెలిపారు. అప్ప్రెంటిషిప్ మేళాకు సంబందించిన మరిన్ని వివరాల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్లు, 8500464782 8341441763

Next Story