బీసీ సంఘం నేత రిషి కుమార్‌ను వరించిన నంది అవార్డు

by Disha Web Desk |
బీసీ సంఘం నేత రిషి కుమార్‌ను వరించిన నంది అవార్డు
X

దిశ, ఊట్కూర్ : వివిధ రంగాల్లో విశిష్టత సేవలు అందించే వారికి ప్రధానం చేసే నంది అవార్డును మండలం పరిధిలోని నిడుగుర్తి గ్రామానికి చెందిన బీసీ సంఘం రాష్ట్ర కార్యదర్శి రిషి కుమార్ అందుకున్నారు. అనునిత్యం ప్రజాక్షేత్రంలో ఉంటూ అనేక సామాజిక సేవలు చేస్తున్నందుకు గాను రవీంద్ర భారతి వేదికగా మంజునాథ ఫౌండేషన్ చైర్మన్ మంజుల గౌడ్ ఆధ్వర్యంలో హర్యాణ గవర్నర్ బండారు దత్తాత్రేయ ఈ అవార్డును అందజేశారు. అనంతరం గవర్నర్ మాట్లాడుతూ.. చిన్న వయసులోనే ఎన్నో సామాజిక సేవలు చేస్తున్న రిషి కుమార్‌కు అవార్డ్ దక్కడం హర్షనీయమన్నారు. దీంతో మండలంలోని ప్రజా ప్రతినిధులు రిషి కుమార్‌కు అభినందనలు తెలుపుతున్నారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ ఎంపీ ఆర్.కృష్ణయ్య, బీసీ కమిషన్ చైర్మన్ వకులాభరణం కృష్ణమోహన్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు వీహెచ్ హన్మంతు రావు, సినీ ప్రముఖులు, తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed