నల్లబెల్లం, పటిక పట్టివేత..

by Disha Web Desk 11 |
నల్లబెల్లం, పటిక పట్టివేత..
X

దిశ, అచ్చంపేట: నాగర్ కర్నూల్ జిల్లాలోని అమ్రాబాద్ మండలం మన్ననూర్ గ్రామంలో శనివారం అచ్చంపేట ఎక్సైజ్ శాఖ అధికారులు తన సిబ్బందితో రూట్ వాచ్ నిర్వహించారు. వాహనాలను తనిఖీ చేస్తుండగా అక్రమంగా టీఎస్ 15 యూబీ 3114 గల కారులో కురకుల రాజు 210కిలోల నల్లబెల్లం, 50 కిలోల పటిక సరఫరా చేస్తుండగా స్వాధీనం చేస్తున్నామని ఎక్సైజ్ శాఖ ఎస్ఐ తెలిపారు. పై ముడిసరుకుతో పాటు ఒక కారును స్వాధీనం చేసుకున్నారు. కురకుల రాజు మన్ననూరు గ్రామానికి చెందిన వాడని వాహనాన్ని తనిఖీ చేస్తుండగా తప్పించుకుని వెళ్లాడని అతనిపై కేసు బుక్ చేశామని తెలిపారు. ఈ రైడింగ్ లో ఎక్సైజ్ శాఖ ఎస్ఐలు బాలరాజు, సతీష్ కుమార్ సిబ్బంది నవీన్, బంతిలాల్, ఆసిఫ్ లు పాల్గొన్నారు.


Next Story

Most Viewed