మొంథా తుఫాన్ ఎఫెక్ట్.. కూలిన మ‌ట్టి మిద్దె..!

by Nallavelli.Anjaneyulu |

దిశ‌, తాడూర్ : మెంథా తుఫాన్ కారణంగా కురుస్తున్న భారీ వర్షానికి మట్టి మిద్దె ఉన్న‌ట్టుండి ఒక్క‌సారిగా కుప్ప కూలింది. దీంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటన నాగర్ కర్నూల్ జిల్లా తాడూరు

మొంథా తుఫాన్ ఎఫెక్ట్.. కూలిన మ‌ట్టి మిద్దె..!
X

దిశ‌, తాడూర్ : మెంథా తుఫాన్ కారణంగా కురుస్తున్న భారీ వర్షానికి మట్టి మిద్దె ఉన్న‌ట్టుండి ఒక్క‌సారిగా కుప్ప కూలింది. దీంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటన నాగర్ కర్నూల్ జిల్లా తాడూరు మండలం బలాన్ పల్లి తాండలో చోటు చేసుకుంది. మెగావత్ సోమ్లా వ్యవసాయం చేసుకుంటూ మట్టి మిద్దె ఇంట్లో ఉంటూ బ‌లాన్ ప‌ల్లి తండాలో జీవనం సాగిస్తున్నారు. బుధవారం కురిసిన వర్షానికి నానిన మట్టి గోడలు ఒక్క‌సారిగా కూలిపోయాయి. అప్రమత్తమైన కుటుంబ సభ్యులు వెంటనే పక్క ఇంట్లోకి వెళ్లారు. ప్రభుత్వం ఆదుకొని నూతన ఇందిరమ్మ ఇల్లును మంజూరు చేయాలని కోరుతున్నారు.

Next Story