- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఉచిత కంటి వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలి ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ
దిశ, అచ్చంపేట : ఉచిత కంటి వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని అచ్చంపేట ఎమ్మెల్యే, డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ సూచించారు. నాగర్ కర్నూల్ జిల్లా లింగాల మండల కేంద్రంలో మేనేజింగ్ డైరెక్ట

దిశ, అచ్చంపేట : ఉచిత కంటి వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని అచ్చంపేట ఎమ్మెల్యే, డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ సూచించారు. నాగర్ కర్నూల్ జిల్లా లింగాల మండల కేంద్రంలో మేనేజింగ్ డైరెక్టర్ అనూష ప్రాజెక్టు ప్రైవేట్ లిమిటెడ్ జలంధర్ రెడ్డి పూర్తి సహకారంతో నిర్వహిస్తున్న ఉచిత కంటి వైద్య శిబిరాన్ని గురువారం ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అచ్చంపేట నియోజకవర్గంలోని పలు ప్రాంతాలలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహిస్తూ మారుమూల ప్రాంతమైన లింగాల మండల కేంద్రం ప్రజలకు ఎలాంటి కంటి చికిత్సతో బాధపడకుండా ఉచిత కంటి చికిత్స శిబిరాన్ని నిర్వహించినందుకు అండపల్లి జలంధర్ రెడ్డి, మేనేజింగ్ డైరెక్టర్ అనూష ప్రాజెక్ట్ ప్రైవేట్ లిమిటెడ్ వారు మరెన్నో సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతున్నందుకు వారికి ధన్యవాదాలు తెలిపారు. 50 సంవత్సరాలు కలిగిన వారి వరకు ఎవరైనా కంటి చికిత్సతో బాధపడుతున్న రోగులు ఎవరైనా ఉచిత కంటి చికిత్స శిబిరాన్ని వినియోగించుకోవచ్చు అన్నారు. ఈ శిబిరాలలో ఉచితంగా అన్ని రకాల కంటి పరీక్షలు నిర్వహిస్తారన్నారు. దగ్గరి చూపు, దూరపు చూపు, తలనొప్పి, మెడనొప్పులు, మోతి బిందువు వంటి సమస్యలకు పరీక్షలు చేస్తారన్నారు.






