అల్లా ఆశీస్సులు అందరికి ఉండాలి.. ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి

by Dishafeatures2 |
అల్లా ఆశీస్సులు అందరికి ఉండాలి.. ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి
X

దిశ, అమరచింత: అల్లా ఆశీస్సులు అందరికి ఎల్లవేళలా ఉండాలని స్థానిక ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర గిడ్డంగుల కార్పోరేషన్ ఛైర్మెన్ సాయి చంద్ లు ఆకాంక్షించారు. శనివారం వనపర్తి జిల్లా అమరచింత మున్సిపాలిటీ కేంద్రంలో ప్రారంభమైన హజ్రత్ సయ్యద్ షా రాజావలి ఉర్సు ఉత్సవాల్లో ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి, సాయిచంద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా భక్తి శ్రద్ధలతో దర్గాలో చాదర్ సమర్పించుకున్నారు. అనంతరం గిడ్డంగుల సంస్థ చైర్మెన్ సాయి చంద్ మాట్లాడుతూ.. కల్వకుంట్ల కవితక్కను ఈడీ, బోడీల పేరుతో వేధిస్తూ తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీయలని చూస్తున్నారని, మతోన్మాదులకు బుద్ధి చెప్పాలని అల్లాను కోరుతున్నట్లు తెలిపారు.

కల్వకుంట్ల కవిత నిర్దోషిగా బయటకు వస్తుందని అన్నారు. అనంతరం దర్గా కమిటీ ఎమ్మెల్యే, ఛైర్మెన్ లను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఎస్.ఏ.రాజు, మున్సిపల్ చైర్ పర్సన్ మంగమ్మ, మాజీ మార్కెట్ కమీటీ చైర్మన్ లు రాజేందర్ సింగ్, నాగభూషణం గౌడ్, అమరచింత, ఆత్మకూర్ మండలాల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రమేష్, రవికుమార్ యాదవ్, స్థానిక ప్రజా ప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు జింక రవి, రఫీ, శంషీర్, కలాం పాషా తదితరులు పాల్గొన్నారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed