మిషన్ భగీరథ నీళ్లు కలుషితం..

by Disha Web Desk 11 |
మిషన్ భగీరథ నీళ్లు కలుషితం..
X

దిశ, ధన్వాడ: మండలంలోని కిష్టాపూర్ గ్రామంలో మిషన్ భగీరథ నీళ్లు కలుషితమై వస్తున్నాయని గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. మిషన్ భగీరథ నీరు ఫిల్టర్ చేసి స్వచ్ఛమైన నీటిని ప్రజలకు అందించే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మిషన్ భగీరథ నీళ్లను ప్రతి ఇంటికి ఇస్తున్న సంగతి తెలిసిన విషయమే.

అలాంటిది మిషన్ భగీరథ కులాయి నీళ్లు స్వచ్ఛమైన నీరుగా రాకుండా కలుషితమై వస్తుండడంతో తాగడానికి అనువుగా లేకపోయినా, గత్యంతరం లేక వాటిని తాగి రోగాల బారిన పడుతున్నామని గ్రామ ప్రజలు వాపోతున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి మిషన్ భగీరథ నీళ్లు కలుషితం కాకుండా స్వచ్ఛమైన నీటిని అందించాలని ప్రజలు కోరుతున్నారు.



Next Story

Most Viewed