- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఢిల్లీలో మల్లిఖార్జున ఖర్గేని కలిసిన మంత్రి వాకిటి శ్రీహరి..
by Kodari Anjali |
ఏఐసీసీ జాతీయ అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్గేను ఢిల్లీలో తెలంగాణ రాష్ట్ర మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు.

X
దిశ, మక్తల్: ఏఐసీసీ జాతీయ అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్గేను ఢిల్లీలో తెలంగాణ రాష్ట్ర మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కర్నాటక రాష్ట్రం నుంచి రాజ్యసభకు నామినేషన్ వేసిన సందర్భంగా తన రాజకీయ గురువు అయిన మల్లిఖార్జున ఖర్గేకు ప్రత్యేకంగా కలుసుకుని శుభాకాంక్షలు తెలిపారు. ఏఐసీసీ జాతీయ అధ్యక్షులుగా మల్లిఖార్జున ఖర్గే, లోక్ సభలో ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ నేతృత్వంలో ఇటీవల కేరళం రాష్ట్రంలో జరిగిన శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సందర్భంగా వారి ధీర్ఘకాల సేవలను కొనియాడారు. రాబోయే రోజుల్లో ఖర్గే, రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ మరిన్ని ఘన విజయాలు సాధించాలని మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి ఆకాంక్షించారు.
Next Story






