బాధితుడికి మంత్రి జూపల్లి పరామర్శ..

by Elthuri vijay kumar |

కేతేపల్లి గ్రామానికి టీచర్ నరసింహ తండ్రి చిన్న పెంటయ్య గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్ నిమ్స్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నాడు.

బాధితుడికి మంత్రి జూపల్లి పరామర్శ..
X

బాధితుడికి మంత్రి జూపల్లి పరామర్శ..

దిశ, పాన్ గల్ : మండల పరిధిలోని కేతేపల్లి గ్రామానికి టీచర్ నరసింహ తండ్రి చిన్న పెంటయ్య గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్ నిమ్స్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నాడు. సమాచారం తెలుసుకున్న రాష్ట్ర ఎక్సైజ్ అండ్ పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు మంగళవారం ఆస్పత్రికి చేరుకుని బాధితుడిని పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. బాధితుడికి మెరుగైన వైద్యం అందించాలని ఆస్పత్రి వర్గాలకు సూచించారు. మంత్రి వెంట మాజీ జెడ్పీటీసీ రవికుమార్ ఉన్నారు.

Next Story