రేపు మ‌క్త‌ల్ కి మంత్రి దామోద‌ర రాజ న‌ర‌సింహ రాక

by Ratna Kumari |

దిశ‌, న‌ర్వ : రేపు మ‌క్త‌ల్ కి రాష్ట్ర‌ వైద్యారోగ్య శాఖ మంత్రి దామోద‌ర రాజ‌న‌ర‌సింహ, మంత్రి వాకిటి శ్రీహ‌రి రానున్న‌ట్టు న‌ర్వ కాంగ్రెస్ మండ‌ల అధ్య‌క్షుడు బిసం చెన్న‌య్య

రేపు మ‌క్త‌ల్ కి మంత్రి దామోద‌ర రాజ న‌ర‌సింహ రాక
X

దిశ‌, న‌ర్వ : రేపు మ‌క్త‌ల్ కి రాష్ట్ర‌ వైద్యారోగ్య శాఖ మంత్రి దామోద‌ర రాజ‌న‌ర‌సింహ, మంత్రి వాకిటి శ్రీహ‌రి రానున్న‌ట్టు న‌ర్వ కాంగ్రెస్ మండ‌ల అధ్య‌క్షుడు బిసం చెన్న‌య్య సాగ‌ర్ తెలిపారు. తాజాగా ఆయ‌న నివాసంలో విలేక‌ర్ల స‌మావేశంలో మాట్లాడారు. తెలంగాణ‌లో మ‌క్త‌ల్ ప‌ట్ట‌ణం నుంచే చేప పిల్ల‌ల పంపిణీ, మ‌క్త‌ల్ ప‌ట్ట‌ణంలో ప‌లు అభివృద్ధి ప‌నుల‌కు శంకుస్థాప‌నలు చేయ‌నున్న‌ట్టు తెలిపారు. అధిక వ‌ర్షాల కార‌ణంగా దెబ్బ తిన్న రోడ్ల‌కు రూ.34ల‌క్ష‌లు, కాల్వెట్ల‌కు రూ.38వేలు మంజూర‌య్యాయ‌ని తెలిపారు. మంత్రుల ప‌ర్య‌ట‌న‌, అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌కు జిల్లా, మండ‌ల నాయ‌కులు, కాంగ్రెస్ కార్య‌క‌ర్త‌లు అధిక సంఖ్య‌లో హాజ‌రై విజ‌య‌వంతం చేయాల‌ని బిసం చెన్న‌య్య సాగ‌ర్ తెలిపారు.

Next Story