మా ఊర్లకు బస్సులు లేవు సారూ.. ఎమ్మెల్యేకు వినతి

by Web Desk |
మా ఊర్లకు బస్సులు లేవు సారూ.. ఎమ్మెల్యేకు వినతి
X

దిశ, నాగర్‌కర్నూల్: నాగర్‌ కర్నూల్ జిల్లాలోని పెద్దముద్దునూర్ మీదుగా కొల్లాపూర్ ప్రాంతానికి మరిన్ని ఆర్టీసీ బస్సులు నడపాలని, సరైన బస్సులు లేకపోవడంతో విద్యార్థులు, సామాన్య ప్రజలు, వికలాంగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారంటూ ఆర్టీసీ డిపో మేనేజర్ ద్వారా బస్సులు నడిపించాలని కోరుతూ మాల మహానాడు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కుర్మయ్య స్థానిక ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డికి వినతి పత్రాన్ని అందించారు. సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.


Next Story

Most Viewed