ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన ట్విట్‌కి స్పందించిన ఎన్నారైలు

by Dishanational1 |
ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన ట్విట్‌కి స్పందించిన ఎన్నారైలు
X

దిశ, ఉండవల్లి: బీఎస్పీ స్టేట్ ఛీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తలపెట్టిన బహుజనులు రాజ్యాధికార యాత్ర గత కొన్ని రోజులుగా అలంపూర్ నియోజకవర్గంలో కొనసాగుతోంది. యాత్రలో భాగంగా ఆర్ఎస్పీ ఉండవల్లి మండలం షేరుపల్లి గ్రామాన్ని సందర్శించినప్పుడు రెహజాబీ అనే దివ్యాంగురాలు ఎన్నో సంవత్సరాలు మూడు చక్రాల వాహనం లేక ఇబ్బందులు పడుతున్నట్లు తన బాధను చెప్పింది.. ఆమె స్థితిగతులను తెలుసుకుని అర్ఎస్పీ తన ట్విట్టర్ ఖాతాలో ట్విట్ చేయగా దానికి ఎన్నారైలు స్పందించి ఆ దివ్యాంగురాలు త్రీ వీలర్ ను ఇప్పించారు. బుధవారం మహిళా దినోత్సవం సందర్భంగా వడ్డేపల్లిలో బీఎస్పీ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సభ కార్యక్రమంలో ఆర్ఎస్పీ చేతుల మీదుగా ఆమెకి అందజేశారు. దీంతో ఆ దివ్యాంగురాలు కృతజ్ఞతలు తెలిపింది.



Next Story

Most Viewed