విద్యుదాఘాతంతో ల్యాబ్ టెక్నీషియన్ మృతి..

by Disha Web Desk 11 |
విద్యుదాఘాతంతో ల్యాబ్ టెక్నీషియన్ మృతి..
X

దిశ, బిజినేపల్లి: విద్యుదాఘాతానికి గురై ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండల పరిధిలో జరిగింది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోెని పాలెం గ్రామానికి చెందిన రమేష్ (30) ల్యాబ్ టెక్నీషియన్ గా పని చేస్తున్నాడు. కాగా తాగునీరు రావడంతో బోరు మోటార్ వేసేందుకు ప్రయత్నించే క్రమంలో ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్యతో పాటు ఇద్దరు పిల్లలు ఉన్నారు. రమేష్ విద్యుత్ ప్రమాదంలో మృతి చెందడంతో గ్రామంలో విషాదం నెలకొంది.


Next Story

Most Viewed