కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన కుష్బూ గుప్త

by Nallavelli.Anjaneyulu |

మహబూబ్ నగర్ జిల్లా నూతన కలెక్టర్ గా కుష్బూ గుప్త శనివారం కలెక్టరేట్ ఛాంబర్ లో బాధ్యతలు స్వీకరించారు.

కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన కుష్బూ గుప్త
X

దిశ, మహబూబ్ నగర్ ప్రతినిధి : మహబూబ్ నగర్ జిల్లా నూతన కలెక్టర్ గా కుష్బూ గుప్త శనివారం కలెక్టరేట్ ఛాంబర్ లో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా స్థానిక సంస్థల ఇంచార్జి కలెక్టర్ మధుసూదన్ నాయక్, గృహ నిర్మాణ శాఖ పీడీ ఉపేందర్ రెడ్డి, ముఖ్య ప్రణాళిక అధికారి రవీందర్, డీపీఆర్ఓ శ్రీనివాస్, డిఎస్ఓ గంప శ్రీనివాస్, పౌర సరఫరాల శాఖ డిఎం రవి నాయక్, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇన్ఫర్మేషన్ ఇంజనీర్ ఇస్రా నాయక్,ఏఓ సువర్ణ రాజ్, జిల్లా అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది మర్యాదపూర్వకంగా కలిసి మొక్కలు, పుష్పగుచ్చాలు అందించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అధికారుల నుద్దేశించి మాట్లాడుతూ ప్రజల సమస్యల పరిష్కారం, జిల్లా అభివృద్ధికి కలసికట్టుగా పనిచేయాలని సూచించారు.

Next Story