బావోజీనీ దర్శించుకున్న కర్ణాటక మంత్రి..

by Disha Web Desk 11 |
బావోజీనీ దర్శించుకున్న కర్ణాటక మంత్రి..
X

దిశ, కొత్తపల్లి: మండలంలోని తిమ్మారెడ్డి పల్లిలో వెలసిన గిరిజనుల ఆరాధ్య దైవం బావాజీ దేవాలయాన్ని శనివారం కర్ణాటక రాష్ట్ర పశు సంవర్ధక శాఖ మంత్రి ప్రభు చౌహాన్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన స్వామి వారికి, కాళికా మాత ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ప్రతియేటా నిర్వహించే జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులూ లేకుండా చర్యలు తీసుకున్న జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష, కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిలను అభినందించారు. జాతరకు వచ్చిన కర్ణాటక మంత్రికి ఆలయ కమిటీ సభ్యులు, రెవెన్యూ డివిజన్ అధికారి, తహసీల్దార్ స్వాగతం పలికి ఘనంగా సన్మానించారు. దేవాలయ అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed