ఆ జిల్లాలో హైటెక్ మోసం..!

by Disha Web Desk 20 |
ఆ జిల్లాలో హైటెక్ మోసం..!
X

దిశ ప్రతినిధి, నాగర్ కర్నూల్ : నాగర్ కర్నూల్ జిల్లాలో సైబర్ నేరగాల్లు ఘరానామోసాలకు పాల్పడుతున్నారు. ఆయా బ్యాంక్ ఖాతాదారుల ప్రమేయం లేకుండానే తమఅకౌంట్లో నుండి 5 నుంచి పదివేల వరకు మాయం చేస్తున్నారు. వారి అకౌంట్లో నుంచి డబ్బులు విత్ డ్రా అవుతున్న విషయం సెల్ఫోన్ మెసేజ్ అందకపోవడంతో ఖాతాదారులు ఆలస్యంగా తేరుకుంటున్నారు. ఖాతాదారులు ఆయా బ్యాంకు మేనేజర్ల వద్ద ఫిర్యాదు చేయడంతో విత్ డ్రా అవుతున్న సమాచారం తమవద్ద లేదని చెప్పడంతో చేసేదేం లేక పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా ఇప్పటికే 10మంది బాధితులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం విశేషం.

అందరూ గత మూడు నెలల క్రితం నాగర్ కర్నూల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఆయా భూముల క్రయవిక్రయాలలో సాక్షులుగా వేలిముద్రలు వేసిన వారు అయి ఉండడం విశేషం. సైబర్ నేరగాళ్లు రిజిస్టర్ కార్యాలయాల నుండి డాక్యుమెంట్ వివరాల ఆధారంగా ఆధార్ నెంబర్ల సాయంతో వేలిముద్రలు తయారుచేస్తూ గ్రామీణ ప్రాంతాల్లో ఉండే మినీబ్యాంక్ ఆధారంగా విత్ డ్రా చేస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఆయా రిజిస్ట్రేషన్ ల వద్ద సాక్షులుగా సంతకాలు చేసిన వారు వెంటనే ఆధార్, వేలిముద్ర లింక్ తొలగించుకోవాల్సిందిగా పోలీసులు సూచిస్తున్నారు. అయితే బాధితులంతా ఒక సంఘంగా ఏర్పడి వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసుకొని ఎప్పటికప్పుడు సమాచారాన్ని చేరవేస్తున్నారు. ఇప్పటికే సైబర్ నేరకాల చేతిలో మోసపోయిన బాధితుల సంఖ్య 20కి చేరినట్లు తెలుస్తోంది.

Next Story