- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
హమ్మయ్యా నా డబ్బులు దొరికాయ్..
by Disha Web Desk 11 |
X
దిశ, నాగర్ కర్నూల్ ప్రతినిధి: రూ. 50 వేల నగదుతో కూడిన చేతి సంచిని ఓ వృద్ధుడు బస్సులో మరచిపోయాడు. అనంతరం ఆర్టీసీ అధికారులు తిరిగి ఆ వృద్ధుడికి ఆ నగదు అందజేశారు. వివరాల్లోకి వెళ్లితే.. వనపర్తి జిల్లా బుద్దారం గ్రామానికి చెందిన బాలయ్య బిజినపల్లి మండలం సల్కర్ పేట గ్రామంలోని తన కూతురు వద్దకు వెళ్లేందుకు నాగర్ కర్నూల్ వెళ్లే బస్సులో ప్రయాణిస్తూ బిజినపల్లి బస్ స్టేషన్ లో దిగాడు.
కాగా ఆపరేషన్ కోసం దాచి ఉంచుకున్న రూ. 50 వేల నగదుతో కూడిన తన సంచి బస్సులో మరచిపోవడంతో లబోదిబోమన్నాడు. వెంటనే ఆర్టీసీ అధికారులు స్పందించి టికెట్ ఆధారంగా కంట్రోలర్ సాయంతో నాగర్ కర్నూల్ బస్టాండ్ లోని బస్సులో వెతికి అక్కడికి పిలిపించి అందులో ఉన్న రూ. 50వేల నగదు అందజేశారు. దీంతో తన డబ్బు తనకు తిరిగి దొరకడంతో ఆర్టీసీ అధికారులకు బాలయ్య కృతజ్ఞతలు తెలిపాడు.
Next Story