ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో దోస్త్ మొదటి విడత అడ్మిషన్ల ప్రారంభం

by Nallavelli.Anjaneyulu |

మద్దూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈనెల 15 నుంచి మొదటి విడత దోస్త్ అడ్మిషన్లు ప్రారంభమైనట్టు కళాశాల ప్రిన్సిపల్ బి కృష్ణారెడ్డి శుక్రవారం తెలిపారు.

ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో దోస్త్  మొదటి విడత అడ్మిషన్ల ప్రారంభం
X

దిశ, మద్దూరు : మద్దూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈనెల 15 నుంచి మొదటి విడత దోస్త్ అడ్మిషన్లు ప్రారంభమైనట్టు కళాశాల ప్రిన్సిపల్ బి కృష్ణారెడ్డి శుక్రవారం తెలిపారు. ఈ అవకాశం వచ్చే నెల 7వ తేదీ వరకు ఉంటుందన్నారు. కళాశాలలో BA, B. COM, B. COM COMPUTERS, BSC(MPCS, BZC) కోర్సులు అందుబాటులో ఉన్నాయన్నారు. ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులైన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకోవాలన్నారు. అడ్మిషన్ పొందిన ప్రతి విద్యార్థికి స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్ మెంట్ సౌకర్యం ఉందన్నారు.

Next Story