- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గవర్నర్ ఏర్పాట్లను పకడ్బందీగా నిర్వహించాలి : కలెక్టర్ ఆదర్శ్ సురభి
దిశ, వనపర్తి : వనపర్తి జిల్లాలో రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ డిసెంబర్ 23న పర్యటించనున్న విషయం తెలిసిందే. అయితే ఈ పర్యటనకు ఏర్పాట్లు పకడ్బందీగా

దిశ, వనపర్తి : వనపర్తి జిల్లాలో రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ డిసెంబర్ 23న పర్యటించనున్న విషయం తెలిసిందే. అయితే ఈ పర్యటనకు ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టర్ కార్యాలయంలో గవర్నర్ పర్యటనకు సంబంధించి అదనపు కలెక్టర్ రెవెన్యూ ఖీమ్యా నాయక్, డీఎస్పీ వెంకటేశ్వర్లు, ఆర్డీవో సుబ్రహ్మణ్యం, డీఆర్డీఓ ఉమాదేవి, డీఎంహెచ్ఓ సాయి నాథ్ రెడ్డి పలు జిల్లా స్థాయి అధికారులతో సమావేశం నిర్వహించారు. సుమారు 3.30 గంటలకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ జిల్లా కేంద్రానికి చేరుకుంటారని.. పలు రంగాలకు చెందిన ప్రముఖులతో ముఖాముఖీ కార్యక్రమంలో పాల్గొననున్నారని తెలిపారు. ప్రోటోకాల్, బందో బస్తు, స్టాళ్ల సందర్శన, డయాస్, సౌండ్ సిస్టమ్, కరెంట్ సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాలని అధికారులను ఆదేశించారు.






