కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి: ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి

by Disha Web Desk 11 |
కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి: ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి
X

దిశ, జడ్చర్ల: కార్మికుల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నారు. మే డే సందర్భంగా జడ్చర్ల మున్సిపాలిటీలోని బాదేపల్లి మార్కెట్ యార్డులో బీఆర్ఎస్ కార్మిక విభాగం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జెండాను ఎమ్మెల్యే ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మికులు శ్రామికులు పనిచేయనిదే లోకం పోకడ ముందుకు సాగదని ఒక పెద్ద భవన నిర్మాణం, ప్రాజెక్టు పనులు, చిన్న కాలువలు ఇలా ఏ కార్యక్రమం తలపెట్టిన శ్రామికుల శ్రమ కృషి తోనే పనులు పూర్తవుతాయని కార్మికులను కొనియాడారు.

కోవిడ్ సమయంలో ఇండ్ల నుంచి బయటికి రావడానికి భయపడ్డ పరిస్థితుల్లో కార్మికులే ధైర్యంగా ముందుకు వచ్చి వారి వారి కార్యకలాపాలు నిత్యం చేసినందుకే మనమంతా ఆరోగ్యంగా ఉండగలిగామని తెలిపారు. రెట్టింపు ఉత్సాహంతో పనిచేసి ముందుకు సాగుదామని భవిష్యత్తులో కూడా కార్మికుల పక్షాన తెలంగాణ ప్రభుత్వం నిలబడి వారి అండగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ కార్మిక విభాగం పట్టణ అధ్యక్షుడు శ్రీనివాస్ యాదవ్ , జడ్పీ వైస్ చైర్మన్ కొడుగల్ యాదయ్య, మున్సిపల్ చైర్పర్సన్ దోరేపల్లి లక్ష్మి, కార్మిక సంఘం నాయకులు, కౌన్సిలర్లు, కార్మికులు మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed