హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన

by velandi.Saikiran |

సిర్సివాడ దుందుభి వాగుపై నిర్మించనున్న హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణ పనులకు సీతక్క సోమవారం శంకుస్థాపన చేశారు.

హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన
X

దిశ, నాగర్ కర్నూల్ /తాడూర్ : తాడూరు మండలం సిర్సివాడ గ్రామం వద్ద దుందుభి వాగుపై రూ.20 కోట్ల 20 లక్షల వ్యయంతో నిర్మించనున్న హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణ పనులకు మంత్రి ధనసరి అనసూయ సీతక్క సోమవారం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో నాగర్‌కర్నూల్ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ మల్లు రవి, ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్ రెడ్డి, నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుళ్ల రాజేష్ రెడ్డి, అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ, కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి, జడ్చర్ల ఎమ్మెల్యే అనురుద్ రెడ్డి, అదనపు కలెక్టర్లు అమరేందర్ దేవ సహాయం పాల్గొన్నారు.

Next Story