పాఠశాలను అకస్మిక తనిఖీ : డీఈఓ విజ‌య‌ల‌క్ష్మి

by Nallavelli.Anjaneyulu |   (  Updated:2025-10-04 08:59:08  IST  )

దిశ‌, మ‌ల్ద‌క‌ల్ : మండ‌ల కేంద్రంలోని జిల్లా ప‌రిష‌త్ ఉన్న‌త పాఠ‌శాల‌ను జిల్లా విద్యాధికారి విజ‌య‌ల‌క్ష్మి అక‌స్మికంగా త‌నిఖీ చేశారు. పాఠ‌శాల‌లో ఉన్న త‌ర‌గ‌తి గ‌దుల‌ను, సైన్స్ ప్ర‌యోగ శాల‌,

పాఠశాలను అకస్మిక తనిఖీ : డీఈఓ విజ‌య‌ల‌క్ష్మి
X

దిశ‌, మ‌ల్ద‌క‌ల్ : మండ‌ల కేంద్రంలోని జిల్లా ప‌రిష‌త్ ఉన్న‌త పాఠ‌శాల‌ను జిల్లా విద్యాధికారి విజ‌య‌ల‌క్ష్మి అక‌స్మికంగా త‌నిఖీ చేశారు. పాఠ‌శాల‌లో ఉన్న త‌ర‌గ‌తి గ‌దుల‌ను, సైన్స్ ప్ర‌యోగ శాల‌, కంప్యూట‌ర్ గ‌ది, వంట గ‌దుల‌ను త‌నిఖీ చేశారు. అదేవిధంగా మ‌ధ్యాహ్న భోజ‌నం ను కూడా ప‌రిశీలించారు. ఉపాధ్యాయులు, విద్యార్థుల హాజ‌రును ప‌రిశీలించి.. ఈ విద్యా సంవ‌త్స‌రంలో ప‌దోత‌ర‌గ‌తి ఫ‌లితాల్లో మంచి రిజ‌ల్ట్స్ తీసుకురావాల‌ని, ఉపాధ్యాయులు విద్యార్థుల‌పై ప్ర‌త్యేక శ్ర‌ద్ధ పెట్టాల‌ని సూచించారు. అలాగే కేజీబీవీ మ‌ల్ద‌క‌ల్ పాఠ‌శాల‌ను కూడా సంద‌ర్శించారు. కేజీబీవీ స్టోర్ రూమ్ లో ఉన్న‌టువంటి వ‌స్తువుల నాణ్య‌త‌, స్టాక్ రిజిస్ట‌ర్ ను ప‌రిశీలించారు. ఆమె వెంట జిల్లా సెక్టోర‌ల్ అధికారి అంప‌య్య‌, మండ‌ల విధ్యాధికారి సురేష్, ఉపాధ్యాయులు ఉన్నారు.

Next Story