ఇంట‌ర్మీడియ‌ట్ ప‌రీక్ష రాసి అదృశ్యం.. కాల్వ‌లో తేలిన శ‌వం

by Ratna Kumari |

ఇంట‌ర్మీడియ‌ట్ ప‌రీక్ష రాసి విద్యార్థి అదృశ్య‌మ‌య్యాడు. అనంత‌రం రెండు రోజుల త‌రువాత కాల్వ‌లో శ‌వమై తేలిన ఘ‌ట‌న బిచ్కుంద మండ‌లంలో చోటు చేసుకుంది.

ఇంట‌ర్మీడియ‌ట్ ప‌రీక్ష రాసి అదృశ్యం.. కాల్వ‌లో తేలిన శ‌వం
X

దిశ‌, మ‌ద్నూర్ : ఇంట‌ర్మీడియ‌ట్ ప‌రీక్ష రాసి విద్యార్థి అదృశ్య‌మ‌య్యాడు. అనంత‌రం రెండు రోజుల త‌రువాత కాల్వ‌లో శ‌వమై తేలిన ఘ‌ట‌న బిచ్కుంద మండ‌లంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. బిచ్కుంద మైనార్టీ గురుకుల క‌ళాశాల‌లో ముజాహిద్(16) ఇంట‌ర్మీడియ‌ట్ ప్ర‌థ‌మ సంవ‌త్స‌రం చ‌దువుతున్నాడు. ఈనెల 05న ఇంట‌ర్మీడియ‌ట్ ప‌రీక్ష రాశాడు. ప‌రీక్ష ముగిసిన త‌రువాత క‌నిపించ‌కుండా పోయాడు. దీంతో ప్రిన్సిపాల్ పోలీసుల‌కు ఫిర్యాదు చేశాడు. శ‌నివారం రోజు ముజాహిద్ పెద్ద ద‌డ్గి గ్రామం స‌మీపంలోని కౌలాస్ నాలా కాలువ వ‌ద్ద శ‌వ‌మై క‌నిపించాడు. ఈ ఘ‌ట‌న పై పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంది.

Next Story