దేవ‌ర‌క‌ద్ర ఎమ్మెల్యే మొబైల్ హ్యాక్.. వాటికి రెస్పాండ్ కావ‌ద్దంటూ..!

by Nallavelli.Anjaneyulu |

దిశ, దేవరకద్ర: ఈ మ‌ధ్య కాలంలో సైబ‌ర్ నేర‌గాళ్లు రోజు రోజుకు రెచ్చిపోతున్నారు. రాజ‌కీయ నాయ‌కులు, బిజినెస్ మ్యాన్ ల‌నే టార్గెట్ గా చేసుకుంటున్నారు. వారికి

దేవ‌ర‌క‌ద్ర ఎమ్మెల్యే మొబైల్ హ్యాక్.. వాటికి రెస్పాండ్ కావ‌ద్దంటూ..!
X

దిశ, దేవరకద్ర: ఈ మ‌ధ్య కాలంలో సైబ‌ర్ నేర‌గాళ్లు రోజు రోజుకు రెచ్చిపోతున్నారు. రాజ‌కీయ నాయ‌కులు, బిజినెస్ మ్యాన్ ల‌నే టార్గెట్ గా చేసుకుంటున్నారు. వారికి తెలియ‌కుండానే వారి మొబైల్ ని, లేదా సిస్ట‌మ్ ని హ్యాక్ చేస్తూ నేరాల‌కు పాల్ప‌డుతున్నారు. తాజాగా దేవ‌ర‌క‌ద్ర ఎమ్మెల్యే మొబైల్ ఫోన్ ను హ్యాక్ చేశారు. త‌న మొబైల్ నుంచి వ‌చ్చే ఎలాంటి సందేశాల‌కు ఎవ్వ‌రూ కూడా రెస్పాండ్ కావ‌ద్ద‌ని ఎమ్మెల్యే జి.మ‌ధుసూద‌న్ రెడ్డి సూచించారు. సైబ‌ర్ నేర‌గాళ్లు వాట్సాప్ ను హ్యాక్ చేసి అర్జెంటుగా రూ.65 వేలు పంపించ‌మ‌ని.. గుర్తు తెలియని వ్యక్తులు మెసేజ్ లు పెడుతున్నారని అలాంటి మెసేజ్ లకు ఎవ్వరూ రెస్పాండ్ కావద్దని ఎమ్మెల్యే జీఎంఆర్ విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే వాట్సాప్ హ్యాక్ చేసిన సైబర్ నేరగాలపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన‌ట్టు ఎమ్మెల్యే తెలిపారు.

Next Story