డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య..!

by Disha Web Desk 11 |
డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య..!
X

దిశ, నవాబుపేట: డిగ్రీ విద్యార్థి ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన నవాబుపేట పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటు చేసుకొంది. ఎస్ఐ పురుషోత్తం తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని కొత్తపల్లి గ్రామానికి చెందిన జంబుల నరేష్ (18), డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. కాగా నరేష్ గత వారం రోజులుగా ఏదో విషయం గురించి దిగులుగా ఉంటున్నాడు.

ఈ క్రమంలోనే శుక్రవారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇది ఇలా ఉండగా తన కొడుకు నరేష్ కు ఎలాంటి దుర అలవాట్లు లేవని, అతని మృతిపై అనుమానాలు ఉన్నాయని మృతుడి తండ్రి రామయ్య ఆరోపిస్తున్నాడు. సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని రామయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.



Next Story

Most Viewed