మూడు గంటల కరెంటు ఇచ్చే కాంగ్రెస్ కావాలా 24 గంటల కరెంటు ఇచ్చే కేసీఆర్ కావాలా – ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి

by Disha Web Desk 11 |
మూడు గంటల కరెంటు ఇచ్చే కాంగ్రెస్ కావాలా 24 గంటల కరెంటు ఇచ్చే కేసీఆర్ కావాలా – ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి
X

దిశ, కొత్తకోట: కొత్తకోట మండల కేంద్రంలోని పామాపురం గ్రామంలో మంగళవారం 100 మంది కాంగ్రెస్, బీజేపీ, పార్టీల కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీలో చేరికలు, డబల్ బెడ్ రూమ్ ఇండ్ల దగ్గర 35 లక్షలతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పైపు నిర్మాణానికి శంకుస్థాపన సందర్భంగా ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు.మూడు గంటల కరెంటు ఇచ్చే కాంగ్రెస్ కావాలా 24 గంటల కరెంటు ఇచ్చే కేసీఆర్ కావాలా మీరే నిర్ణయించుకోండి అని పామాపురం గ్రామ ప్రజలను ఉద్దేశించి అన్నారు. రెండుసార్లు నన్ను ఎమ్మెల్యేగా గెలిపించారని, మూడోసారి.. మరొకసారి ఎమ్మెల్యేగా నన్ను మీరు ఆశీర్వదించాలని ప్రజలను ఎమ్మెల్యే కోరారు.

55 ఏళ్లు నుండి స్వాతంత్రం వచ్చినప్పటి నుండి రాజ్యం ఏలిన కాంగ్రెస్ పార్టీ పామపురం గ్రామానికి బ్రిడ్జి, రైతు బీమా, కల్యాణ లక్ష్మి, రైతుబంధు, పింఛన్లు,ఇలాంటి సంక్షేమ పథకాలుఎందుకు తీసుకు రాలేదని కాంగ్రెస్, బీజేపీ,నాయకులను ప్రజలు ప్రశ్నించాలని కోరారు. ఇలాంటి సంక్షేమ పథకాలు ఇచ్చే దమ్మున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ను... ఎమ్మెల్యేగా నన్ను మీరు మరొకసారి ఆశీర్వదించాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ వామన్ గౌడ్, సి డి సి చైర్మన్ చెన్నకేశవరెడ్డి, సర్పంచ్ లక్ష్మారెడ్డి కొండారెడ్డి, భీమ్ రెడ్డి, ఉమామహేశ్వర్ రెడ్డి,గాడిల ప్రశాంత్,మాజీ మార్కెట్ చైర్మన్ సాక బాల నారాయణ, గులాబీ గోవింద్,అయ్యన్న, వసీం ఖాన్,సుభాష్, షేక్ వహీద్, కటిక శీను,వికాస్, కిరణ్, మహేష్, తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed