మాంసం వ్యాపారులు ఆటోలో ప్రచారం

by Ratna Kumari |

మాంసం వ్యాపారులు ఆటోలో ప్రచారం
X

దిశ, మిడ్జిల్ : హిందువుల అతిపెద్ద పండుగ దసరా.. అయితే ఈసారి ద‌స‌రా పండుగ రోజు గాంధీ జయంతి రావడంతో మాంసం మద్యం ప్రియులకు ఇబ్బందులు కలుగుతున్నాయి. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా మటన్ వ్యాపారస్తులు ముందస్తుగా గ్రామాలలో ఆటో ద్వారా ప్రచారం నిర్వహిస్తున్నారు. బుధవారం రోజు చికెన్, మటన్ అమ్మకాలు రాత్రి అంత షాపుల వద్ద అమ్మకాలు నిర్వహిస్తున్నాము అని తెలిపారు. గ్రామాలలో ప్రజలు ఇబ్బంది పడకుండా ముందస్తు మాంసం కొనుగోలు చేయాలని ఆటోద్వారా, సోషల్ మీడియా వాట్సాప్ గ్రూప్ లలో జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు.

Next Story