మున్సిపల్ కౌన్సిలర్స్ గా బీటెక్ స్టూడెంట్స్

by Nallavelli.Anjaneyulu |

మున్సిపల్ ఎన్నికల్లో యువత ఎక్కువ స్థానాలలో విజయం సాధించింది. వీరిలో ప్రస్తుతం విద్యాభ్యాసం చేస్తున్నవారు సైతం పోటీ చేసి విజయం సాధించారు.

మున్సిపల్ కౌన్సిలర్స్ గా  బీటెక్ స్టూడెంట్స్
X

దిశ, మహబూబ్ నగర్ బ్యూరో : మున్సిపల్ ఎన్నికల్లో యువత ఎక్కువ స్థానాలలో విజయం సాధించింది. వీరిలో ప్రస్తుతం విద్యాభ్యాసం చేస్తున్నవారు సైతం పోటీ చేసి విజయం సాధించారు. కొత్తకోట మున్సిపల్ ఆరవ వార్డు నుంచి బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్న జే అఖిల ఇటీవల జరిగిన ఎన్నికలలో పోటీ చేసి విజయం సాధించారు. అలంపూర్ తొమ్మిదవ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా కే మాధురి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. సోమవారం జరిగిన ప్రమాణ స్వీకారం కార్యక్రమాలలో వారి వారి మున్సిపల్ కేంద్రాలలో ఈ ఇరువురు బీటెక్ స్టూడెంట్స్ చేసిన ప్రమాణస్వీకారం అందరినీ ఆకట్టుకుంది. తమకు వచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకొని ప్రజలకు సేవలు అందిస్తామ‌ని వారు వెల్లడించారు.

Next Story