పట్టణ ప్రగతిలో బీఆర్ఎస్ కౌన్సిలర్లు డుమ్మా..

by Disha Web Desk 20 |
పట్టణ ప్రగతిలో బీఆర్ఎస్ కౌన్సిలర్లు డుమ్మా..
X

దిశ, మక్తల్ : మక్తల్ మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసినపట్టణ ప్రగతి కార్యక్రమంలో బీఆర్ఎస్ అధికార పార్టీ కౌన్సిలర్లు ఆరుగురు గైరాజరైయ్యారు. కాగా శుక్రవారం నిర్వహించిన పట్టణ ప్రగతి కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి, ఇంచార్జి అధికారి జాన్ సుధాకర్ బీసీ వెల్ఫేర్ అధికారి, మున్సిపల్ చైర్ పర్సన్ పావని, వైస్ చైర్పర్సన్ అఖిల రాజశేఖర్ రెడ్డి హాజరయ్యారు.

మక్తల్ మున్సిపాలిటిని బీజేపీ కైవసం చేసుకోవడంతో మున్సిపల్ చైర్పర్సన్ గా పావని, వైస్ చైర్ పర్సన్ గా అఖిల రాజశేఖర్ రెడ్డి ఎన్నికయ్యారు. కొత్తగా ఏర్పడిన మక్తల్ మున్సిపాలిటీలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టే తరుణంలో ప్రారంభం నుండి ఇప్పటివరకు అభివృద్ధి పనుల కేటాయింపులలో బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్యన సఖ్యత లేదు. మక్తల్ మున్సిపాలిటీలో కౌన్సిలర్ల మధ్యనే ఏకాభిప్రాయాలు లేకపోవడంతో ఈ కార్యక్రమాన్ని బహిష్కరించాలని పలువురు అనుకున్నారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed