ఉప స‌ర్పంచ్ ల సంఘం అధ్య‌క్షుడిగా బ‌స్న‌మోని శ్రీను ముదిరాజ్

by Nallavelli.Anjaneyulu |

మండ‌ల ప‌రిధిలోని ఉప స‌ర్పంచ్ ల సంఘం అధ్య‌క్షుడిగా బ‌స్న‌మోని శ్రీను ముదిరాజ్ ఎన్నిక‌య్యారు. వెల్దండ మండ‌ల ఉప స‌ర్పంచ్ కొత్త కార్య‌వ‌ర్గాన్ని శ‌నివారం ఏక‌గ్రీవంగా ఎన్నుకున్నారు.

ఉప స‌ర్పంచ్ ల సంఘం అధ్య‌క్షుడిగా బ‌స్న‌మోని శ్రీను ముదిరాజ్
X

దిశ‌, వెల్దండ : మండ‌ల ప‌రిధిలోని ఉప స‌ర్పంచ్ ల సంఘం అధ్య‌క్షుడిగా బ‌స్న‌మోని శ్రీను ముదిరాజ్ ఎన్నిక‌య్యారు. వెల్దండ మండ‌ల ఉప స‌ర్పంచ్ కొత్త కార్య‌వ‌ర్గాన్ని శ‌నివారం ఏక‌గ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా వెల్దండ మండల కేంద్రానికి చెందిన ఉప సర్పంచ్ బస్నమోని శీను ముదిరాజ్, ఉపాధ్యక్షుడిగా బండోన్ ప‌ల్లి ఉపసర్పంచ్ అల్వాల్ యాదవు లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా బస్నమోని శ్రీను ముదిరాజ్ మాట్లాడుతూ... ఉప సర్పంచుల సమస్యల పరిష్కారానికి పాటుపడతానన్నారు. కార్యక్రమంలో ఆయా గ్రామాల ఉప సర్పంచ్ లు పాల్గొన్నారు.

Next Story