నాగర్ కర్నూల్ ఎంపీ స్థానం నుంచి బర్రెలక్క పోటీ

by Disha Web Desk 23 |
నాగర్ కర్నూల్ ఎంపీ స్థానం నుంచి బర్రెలక్క పోటీ
X

దిశ, నాగర్ కర్నూల్ కలెక్టరేట్ : వచ్చే సార్వత్రిక ఎంపీ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు బర్రెలక్క అలియాస్ శిరీష ఆదివారం ఓ వీడియో ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చూసి బాధపడ్డానని అయినా అవేవి పట్టించుకోకుండా నాగర్ కర్నూల్ నుంచి ఎంపీగా, ఎమ్మెల్సీగా పోటీ చేస్తానని గెలిచే వరకు పోటీ చేస్తూనే ఉంటానని ఓ నిరుద్యోగి తలుచుకుంటే ఏమైనా చేయగలరని ప్రపంచానికి చాటి చెప్పే విధంగా పోటీ చేస్తూనే ఉంటానన్నారు.

ఎమ్మెల్యేగా ఓడిపోయిన ఎంపీగా గెలిపిస్తారని ఆశతో పోటీ చేస్తున్న ఒక నిరుద్యోగి అసెంబ్లీలో గాని పార్లమెంట్ లో గాని అడుగు పెట్టాలి మీరందరూ నాకు సపోర్ట్ చేయాలని కోరారు. చాలామంది డబ్బులు చూసి ఓట్లు వేస్తున్నారు మంచి చేసే వారికి ఓట్లు వేయండి అని, తల్లిదండ్రులు అందరూ మీ పిల్లల భవిష్యత్తును ఆలోచించి మీ కూతురు లాంటి నాకు మీ అమూల్యమైన హస్తాలతో తనకు ఓటు వేయాలని వీడియోలో చెప్పుకొచ్చారు.

Next Story

Most Viewed