ఎద్దు అడ్డు రావడంతో మూడు పల్టీలు కొట్టిన ఆటో .. ఓకరు మృతి ఏడుగురుకి తీవ్ర గాయాలు

by Disha Web Desk 12 |
ఎద్దు అడ్డు రావడంతో మూడు పల్టీలు కొట్టిన ఆటో .. ఓకరు మృతి ఏడుగురుకి తీవ్ర గాయాలు
X

దిశ, ప్రతినిధి నాగర్ కర్నూల్: ఎదురుగా వస్తున్న ఎద్దును తప్పించబోయి అటో బోల్తా పడిన ఘటనలో ఓ మహిళ మృతిచెందగా మరో ఏడుగురు తీవ్ర గాయాల పాలయ్యారు. ఈ ఘటన నాగర్ కర్నూల్ జిల్లా పరిధిలోని దేశిటిక్యాల గ్రామ శివారులో సోమవారం చోటుచేసుకుంది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం తెలకపల్లి మండలం పెద్దపల్లి గ్రామానికి చెందిన బాధితులు నాగర్ కర్నూల్ పట్టణానికి ఆటోలో ప్రయాణిస్తున్నారు.

దేశిటిక్యాల గ్రామ శివారుకు వచ్చేసరికి రోడ్డుపై ఎద్దు అడ్డు రావడంతో దాన్ని తప్పించేందుకు బ్రేక్ వేయడంతో ఆటో బోల్తా పడింది. అతివేగం కారణంగా ఆటో మూడు పల్టీలు కొట్టింది. దీంతో అందులో ప్రయాణిస్తున్న మారేడు పద్మ (38) అక్కడికక్కడే మృతి చెందగా మరో ఏడుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. వారిని వెంటనే 108 సాయంతో నాగర్ కర్నూల్ జనరల్ ఆసుపత్రికి చేర్చి చికిత్స అందిస్తున్నారు.


Next Story